- పవర్లూం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేశ్
నవతెలంగాణ-తంగళ్లపల్లి
కార్మికులకు కూలి ఒప్పందం జరిగిన తర్వాతనే సమ్మె విరమిస్తామని పవర్లూం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేష్ అన్నారు. మండలంలోని టెక్స్టైల్పార్క్ కార్మికులు కూలి పెంచాలని చేస్తున్న సమ్మె శనివారానికి 13వ రోజుకు చేరుకుంది. కార్మికులు చేస్తున్న సమ్మె శిభిరం వద్దకు టెక్స్టైల్పార్క్ ఏడీ అశోక్రావు వచ్చి కార్మికులతో మాట్లాడారు.
యాజమానులతో చర్చలు జరిపి నెల రోజుల్లోగా కూలి సమస్యను పరిష్కరిస్తామని సమ్మె విరమించాలని కార్మికులను కోరారు. దీంతో కార్మికులు కూలి ఒప్పందం జరిగిన తర్వాతనే సమ్మె విరమిస్తామని చెప్పారు. అనంతరం మూషం రమేష్ మాట్లాడుతూ కూలి సమస్యల పరిష్కారం కోసం కేటీఆర్ను కలిసేందుకు కార్మికులందరూ సిద్ధపడుతున్నట్టు తెలిపారు.
శుక్రవారం టెక్స్టైల్పార్క్ కార్మిక నాయకులు కలెక్టర్తో జరిపిన చర్చలు వాటి వివరాలను కార్మికులకు తెలియజేశారు. కార్మికుల నిర్ణయం తీసుకుని కూలి ఒప్పందం అయ్యే వరకు సమ్మెను కొనసాగిస్తామన్నారు. కలెక్టర్ యాజమానులతో చర్చలు జరిపి వెంటనే కూలి ఒప్పందాన్ని అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. లేని పక్షంలో కేటీఆర్ను కలవడానికి సిద్ధపడుతున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పవర్లూం వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు కూచన శంకర్, అన్నల్దాస్ గంగాధర్, కార్మికులు పాల్గొన్నారు.
Authorization