నవతెలంగాణ-రామగుండం మొదటి విడత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రేపు జరగబోయే గ్రామపంచాయతీ ఎన్నికలకు ఎన్టీపీసీ జడ్పీహెచ్ఎస్ పాఠశాల ఆవరణలో ఎన్నికల సామగ్రి పంపిణీ ఏర్పాట్లను పెద్దపల్లి ఆర్డీవో ఉపేందర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామగుండం గ్రామపంచాయతీ ఎన్నికలను సజావుగా నిర్వహించాలని పెద్దపల్లి ఆర్డీవో ఉపేందర్ రెడ్డి అన్నారు. సమస్యాత్మక పంచాయతీల పరిధిలో నియమించిన ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ నిర్వహించాలని సూచించారు. తదుపరి రెండు గంటల కౌంటింగ్ ప్రక్రియ చేపట్టాలన్నారు. అనంతరం ఫలితాలను ప్రకటించి ఉప సర్పంచ్ ఎన్నికలను కూడా వెంటనే నిర్ణయించాలని కోరారు. ఎన్నికల్లో మైక్రో పరిశీలకులు కీలకపాత్ర పోషించాలన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద 100 మీటర్లలోపు వాహనాలను అనుమతించరాదని ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట రామగుండం మండల పరిషత్ ఎంపీడీవో బాల శివాజీ , సంబంధిత అధికారులు ఉన్నారు.