నవతెలంగాణ-కమాన్పూర్ మండలకేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ నెల 25న నిర్వహించే జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా మధ్యాహ్నం భోజనం సమయంలో ''వక్తత్వ పోటీ'', ''బాధ్యత గల పౌరునిగా మారడం ఎలా?'' అనే అంశాలపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో కమాన్పూర్, జూలపల్లి, రొంపికుంట ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పాల్గొని వారి ప్రతిభను కనబర్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల తహసీల్దార్ రామ్మోహన్ రావు మాట్లాడుతూ ''ఓటరుగా గర్వించు...ఓటేయడానికి సిద్ధపడు'' అనే నినాదాన్ని ప్రచారం చేయాలన్నారు. ఈ పోటీల్లో గెలిచిన విద్యార్థులను మండల తహసీల్దార్ అభినందించారు.