నవతెలంగాణ-గోదావరిఖని రామగుండం కార్పొరేషన్లోని 24వ డివిజన్ ఎల్బీనగర్కు చెందిన బస్తీ వాసులు శనివారం పార్కు నిర్మాణ స్థలం కబ్జాపై రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ బీ.శ్రీనివాస్కు వినతి పత్రం అందజేశారు. ఎల్బీనగర్లో సీనియర్ సిటిజెన్ హాల్ వెనకాల ఉన్న ఖాళీ స్థలం 2 గుంటల్లో మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయన పార్కు నిర్మాణం కోసం 2 సార్లు కొబ్బరికాయ కొట్టారని పేర్కొన్నారు. కానీ ఈ స్థలాన్ని ఇదే బస్తీకి చెందిన సింగరేణి కార్మికుడు గడ్డం రాజయ్య అనే వ్యక్తి కబ్జా చేశారని తెలిపారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో డివిజన్ వాసులు మైసయ్య, దుబాసీ బొందయ్య, మిట్టపల్లి అంకూస్ ఉన్నారు.