బ్రిడ్జి పనులు పరిశీలించిన కరీంనగర్ సీపీ కమలాసన్ రెడ్డి
తిమ్మాపూర్ : మండలంలోని అల్గునూర్లో గల మానేరు వంతెన బ్రిడ్జి పనులను శనివారం కరీంనగర్ పోలీస్ కమిషనర్ వీ.బీ .కమలాసన్ రెడ్డి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనదారుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా త్వరితగతిన పనులు పూర్తి చేయాలని సూచించారు. అలాగే ట్రాఫిక్ నియంత్రణ కోసం వాహనాలను గతంలో నిర్మించిన పాత బ్రిడ్జి నుంచి దారి మళ్లించాలని అధికారులను ఆదేశించారు. పనులను పరిశీలించిన వారిలో ఆయన వెంట ట్రాఫిక్ సీఐ సీతా రెడ్డి, ట్రాఫిక్ ఎస్ఐలు., సిబ్బంది తదితరులు ఉన్నారు.