హుజూరాబాద్: ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిిసైడింగ్ అధికారులు ఎన్నికల విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలని మండల ఎన్నికల అధికారి కృష్ణప్రసాద్ సూచించారు. పట్టణంలోని మండల పరిషత్ కార్యాల యంలో ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు ఎన్నికల విధుల పట్ల శనివారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పోలింగ్ బ్యాలెట్ బాక్సులపై సమగ్ర అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఎన్నికలకు ఒకరోజు ముందుగానే నమూనా పోలింగ్ వేసి పరిశీలించుకోవాలన్నారు. ఈ నెల 30న జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఎన్నికల సిబ్బంది అధికారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. పోలింగ్ రోజు ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే పైఅధికారులకు తెలియజేయాలని అన్నారు. మోడల్ కోడ్ను పకడ్బందీగా అమలు చేయాలన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.