నవతెలంగాణ-తిమ్మాపూర్ మండలంలోని రామఖీష్ణ కాలనీ; పర్లపల్లి గ్రామాల్లో చేపడుతున్న మిషన్ కాకతీయ పనులలో తీస్తున్న మట్టిని అక్రమంగా కరీంనగర్ కు తరలిస్తున్నారన్న స్థానికుల ఫిర్యాదు మేరకు, తహసీల్దార్ ఆదేశాల ప్రకారం రెండు టిప్పర్ వాహనాలను శనివారం పట్టుకున్నట్లు అర్ఐ రాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిషన్ భగీరథ పనులలో మోతాదుకు మించి తవ్వకాలు జరిపి, బిల్డింగ్ పనుల నిమిత్తం కరీంనగర్కు తరలిస్తున్నారని చెప్పారు. పట్టుకున్న టిపర్లను, వారిని తహాసిల్దార్ కార్యాలయానికి తరలించినట్టు తెలిపారు. ఆయన వెంట వీఆర్వో, వీఆర్ఏలు ఉన్నారు.