భగత్నగర్: ఈ నెల 21 నుంచి 26 వరకు జాతీయ బాలిక దినోత్సవ వారోత్సవాలను మహిళలు, పిల్లలు, వికలాంగులు, వయోవృద్ధుల శాఖ కరీంనగర్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్టు జిల్లా సంక్షేమాధికారి ఎం.శారద శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మొదటి రెండు రోజులు జిల్లా మండల స్థాయి కమిటీ సమావేశాలు ఉంటాయని పేర్కొన్నారు. ప్రజా ప్రతినిధులతో బేటీ బచావో, బేటీ పడావో కార్యక్రమ నిర్వహణ ఉంటుందని తెలిపారు. మూడవ రోజు ఆడపిల్లలకు, జన్మనిచ్చిన తల్లులను సత్కరించుట, ఆ అమ్మాయిల పేరిట మొక్కలు నాటుట జనన ధృవీకరణ పత్రాలు ఇవ్వటం వంటివి ఉంటాయని పేర్కొన్నారు. నాల్గవ రోజు జిల్లా స్థాయిలో జాతీయ బాలిక దినోత్సవ వారోత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు.