తిమ్మాపూర్ : మండలంలోని మహాత్మానగర్ గ్రామపం చాయతీ సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచిన పొన్నాల భూలక్ష్మిని అధిక మెజార్టీతో గెలిపించాలని జెడ్పిటిసి పద్మ కోరారు. మండలంలోని మహాత్మా నగర్లో శనివారం ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి జరగాలంటే భూలక్ష్మిని గెలిపిం చాలని చెప్పారు. టీఆర్ఎస్ బలపర్చిన బడుగు, బలహీనవర్గాల అభ్యర్థిగా తమ ముందుకు వస్తుందని అందరూ ఆశీర్వదించి, కప్పు సాసర్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఆమె వెంట నాయకులు పొన్నాల సంపత్ ,దుర్గాప్రసాద్, మహిళలు పాల్గొన్నారు..