సౌతాఫ్రికా గ్రూప్ఆఫ్ ఆపరేషన్స్డైరెక్టర్ దినేష్నాయుడు
నవతెలంగాణ-కలెక్టరేట్
కరాటేలో భారతదేశం ఒలింపిక్స్ స్థాయికి ఎదిగి, దేశ పేరు ప్రతిష్టలను ప్రపంచస్థాయిలో ఇనుమడింపజేయాలని ప్రముఖ కరాటే క్రీడాకారుడు, సౌతాఫ్రికా గ్రూప్ఆఫ్ ఆపరేషన్స్ డైరెక్టర్ దినేష్నాయుడు ఆకాంక్షించారు. రెండు రోజులుగా నగరంలో జరుగుతున్న జాతీయ స్థాయి కరాటే పోటీలను శనివారం ఆయన తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరాటే అంటే ఎంతో మక్కువ అన్నారు. దేశంలో ఎలాంటి ఆయుధాలు లేకుండా రిక్తహస్తాలతోనే ఆత్మరక్షణ చేసుకునే క్రీడను అభివృద్ధి చేయాలనే తపనతో ఎక్కడ పోటీలు జరిగినా తాను హాజరై ప్రోత్సహిస్తున్నట్టు వెల్లడించారు. మరో అతిథి ఎస్వీ ఎస్ ట్రావెల్స్ అధినేత సాదిక్ పాషా మాట్లాడుతూ.. తెలంగాణ క్రీడాకారులు కూడా ఒలింపిక్స్లో పాల్గొని పతకాలు సాధించి సత్తా చాటాలన్నారు. రెండో రోజు పోటీల్లో భాగంగా తెలంగాణ 86, హర్యానా 84, ఆంధ్రప్రదేశ్ 84, తమిళనాడు 61, పంజాబ్ 53, మధ్యప్రదేశ్ 50, మహారాష్ట్ర 23, కర్ణాటక 21, కేరళ 18 పతకాలు సాధించినట్టు నిర్వాహకులు వెల్లడించారు. అంతకుముందు మోటార్ సైకిళ్ల కోసం నిర్వహించిన ఓపెన్ ఫైట్లో పలువురు క్రీడాకారులు పాల్గొని, తమ ప్రతిభాపాటవాలు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో సీఎస్కెఐ చైర్మన్ చల్ల హరిశంకర్, చీఫ్ ఆర్గనైజర్ ఈ.శ్రీనివాస్, వంగల శ్రీధర్, ఆర్.ప్రసన్న కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
కమిషనరేట్ పరిధిలో
Authorization