- రూ. లక్ష 24 వేల రూపాయల మద్యం స్వాధీనం
- పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు
నవతెలంగాణ- కలెక్టరేట్
కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా వివిధ ప్రాంతాల్లో ఓటర్లను మభ్య పెట్టడానికి మద్యాన్ని సరఫరా చేస్తున్నారా పక్కా సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్, పోలీస్ స్టేషన్ల సిబ్బంది మెరుపు దాడులు నిర్వహించారు. రంగంలోకి దిగిన సిబ్బంది మూకుమ్మడిగా గంగాధర, ఇల్లందకుంట, రామడుగు, వీణవంక ప్రాంతాల్లో భాగంగా బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత పోలీస్ స్టేషన్లో అప్పగించి కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు . గంగాధర పోలీస్స్టేషన్లో శ్యాంసుందర్రెడ్డి, కోరేం తిరుపతి, మల్లారపు రవి, రాగి దుర్గేష్ వీరిపై గంగాధర పోలీస్స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. వీరి వద్ద నుంచి రూ. 64వేల రూపాయల విలువగల మద్యం స్వాధీనం చేసుకున్నారు. ఇల్లందకుంట పోలీస్ స్టేషన్లో ప్రవీణ్, కృష్ణ పైన రెండు కేసులు నమోదయ్యాయి. వీరి వద్ద నుంచి రూ. 18 వేల రూపాయల మద్యం స్వాధీనం చేసుకున్నారు. రామడుగు పోలీస్ స్టేషన్లో సాయి ప్రతాప్రెడ్డిపై కేసు నమోదు చేశారు. ఈయన వద్ద నుంచి రూ. 12 వేల రూపాయల మద్యం స్వాధీనం చేసుకున్నారు. వీణవంక పోలీస్స్టేషన్లో కుమార్ స్వామి, వెంకటేష్ రెండు కేసులు నమోదయ్యాయి. రూ. 32 వేల రూపాయల మద్యం స్వాధీనం చేసుకున్నారు. మొత్తం ఏడు కేసులు నమోదు చేశారు. రూ. లక్ష 24వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో టాస్క్ఫోర్స్ ఏసీపీ పీ.శోభన్ కుమార్, సీఐలుఎస్. శ్రీనివాసరావు, కె.జనార్ధన్ రెడ్డి, ఏఎస్ నర్సయ్య , సంబంధిత పోలీస్స్టేషన్ల సిబ్బంది పాల్గొన్నారు.
Authorization