భగత్నగర్ : జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా పాఠశాల స్థాయి విద్యార్థులకు జిల్లా స్థాయి పోటీలు నిర్వహిస్తున్నట్టు కరీంనగర్ జిల్లా విద్యాశాఖాధికారి ఒక ప్రకటనలో తెలిపారు. కరీంనగర్లోని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ స్టేడియంలో 21న ఉదయం 9.30 గంటలకు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో వ్యాసరచన, ఉపన్యాసాల పోటీలను అందులో గెలిచిన వారు జిల్లా స్థాయి పోటీలకు అర్హులన పేర్కొన్నారు. రంగోళి చిత్రలేఖన పోటీలకు కావాల్సిన సామగ్రితో నేరుగా హాజరు కావాలని సూచించారు.