- కరీంనగర్ జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ నవతెలంగాణ-భగత్నగర్ మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ర్యాండమైజేషన్ ద్వారా పోలింగ్ సిబ్బందిని కేటాయించామని కరీంనగర్ జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా ఎన్నికల పరిశీలకురాలు భారతి లక్పతి నాయక్ సమక్షంలో శనివారం ర్యాండమైజేషన్ నిర్వహించారు. ఈ నెల 30న జరుగనున్న ఇల్లందకుంట మండలం వి. సైదాపూర్, జమ్మికుంట, వీణవంక, హుజూరాబాద్ మండలాల గ్రామ పంచాయతీ ఎన్నికలకు ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా ఎంపిక చేసి కేటాయించామని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి సీహెచ్ మనోజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.