- ఏపీఎం రమాదేవి నవతెలంగాణ-జమ్మికుంట మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన జాబ్మేళాకు విశేష స్పందన వచ్చిందని ఏపీఎం రమాదేవి అన్నారు. మండలంలోని నిరుపేద, నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణను అందించే ఉపాధిమేళాను మండల ంలోని ఐకేపీ కార్యాలయంలో సన్స్కిల్స్ కోఆర్డినేటర్స్ రాజేందర్, తేజేశ్వర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీఎం మాట్లాడుతూ ఈ జాబ్మేళాలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన సుమారు 60 మంది నిరుద్యోగ యువతి, యువకులు పాల్గొన్నారని తెలిపారు. అభ్యర్థుల సర్టిఫికెట్స్ వెరిఫికేషన్తో పాటు వారిని ఇంటర్వ్యూ చేసినట్టు చెప్పారు. వారి విద్యార్హత ఆధారంగా వరంగల్లో శిక్షణ, ఉపాధి కల్పించనున్నట్టు తెలిపారు. ఈ జాబ్మేళాకు హాజరుకాని యువత నేరుగా ఆదివారం సన్స్కిల్స్ శిక్షణ కేంద్రానికి రావచ్చునని ఆమె చెప్పారు. పూర్తి వివరాలను వరంగల్లోని పోచమ్మ మైదానం, రిలయన్స్ ఫ్రెష్ పక్కన సన్స్కిల్స్ కోఆర్డినేటర్లను గానీ ఫోన్నెంబర్ 9849131050లో సంప్రదించవచ్చని తెలిపారు.