- అఖిల పక్ష నాయకులు
నవతెలంగాణ-హుజూరాబాద్
మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే ఈటల రాజేందర్కు మంత్రి పదవిపై ఉన్న శ్రద్ధ హుజూరాబాద్ జిల్లా ఏర్పాటుపై లేదని అఖిల పక్ష నాయకులు అన్నారు. పట్టణంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం 2016లో కొత్త జిల్లాల ఏర్పాటు కోసం నోటిఫికేషన్ ఇచ్చిందన్నారు. అదే సందర్భంలో హుజూరాబాద్ కేంద్రంగా పీవీ జిల్లా ఏర్పాటు చేయాలని ఈ ప్రాంతానికి చెందిన అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయ కులు ఉద్యమాలు చేశారని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో అప్పటి ఆర్థికశాఖ మంత్రిగా ఉన్న స్థానిక ఎమ్మెల్యే ఈటల రాజేం దర్ ఇప్పటికే 31 జిల్లాల ప్రక్రియ ముగిసిందని, ఒకవేళ 32వ జిల్లా అనేది ఏర్పడితే అది హుజూరాబాద్ జిల్లానే అవుతుందని హామీ ఇచ్చారని గుర్తు చేశారు.
ఈటల హామీతో ఉద్యమాన్ని విరమించారని తెలిపారు. అయితే 2018 సార్వత్రిక ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ముఖ్యమత్రి కేసీఆర్ ములుగు, నారాయణపేట జిల్లాలను ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ రెండు జిల్లాల ఏర్పాటుకు నోటిఫికేషన్ ఇచ్చారన్నారు. ఈటల రాజేందర్ 32వ జిల్లాగా ఏర్పాటు చేస్తామన్న హామీని విస్మరించారని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా పదవులను తణప్రాయంగా వదిలేసి అనేక సార్లు ఎమ్మెల్యేగా కూడా రాజీనామా చేసిన ఉద్యమ నేత ఈటల, నేడు తన మంత్రి పదవి కోసం జిల్లా ఏర్పాటు విషయాన్ని పట్టించుకోవడం లేదన్నారు. జిల్లా ఏర్పాటు అయ్యే వరకు ఈటల రాజేందర్ మంత్రివర్గంలో చేరకూడదని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ఈ ప్రాంతానికి చెందిన రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మికాంతారావు, హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీష్ కుమార్లు సైతం జిల్లా ఏర్పాటు కోసం తమ వంతు కషి చేయాలని అన్నారు. ఈ ప్రాంత ప్రజల మనోభావాలను గుర్తించాలన్నారు. లేనియెడల రానున్న రోజుల్లో చరిత్రహీనులుగా మిగిలిపోతారని అన్నారు. జిల్లా ఏర్పాటు కోసం అఖిలపక్షం ఆధ్వర్యంలో భవిష్యత్తు కార్యాచరణ రుపొందిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి పోనగంటి శ్రావణ్ కుమార్, బీజేపీ పట్టణ అధ్యక్షుడు మాడుగుల ప్రవీణ్, నందగిరి మహేందర్రెడ్డి, కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి కొండ్ర నరేష్, కాంగ్రెస్ నాయకులు చంద్రగిరి కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Authorization