- సాధన కమిటీ ఆధ్వర్యంలోరిలే నిరాహార దీక్షలు
నవతెలంగాణ -హుజూరాబాద్
హుజూరాబాద్ను వెంటనే పీవీ జిల్లాగా ప్రకటించాలని జిల్లా సాధన కమిటీ సభ్యులు అన్నారు. జిల్లా సాధన కోసం స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో చేపట్టిన రిలే నిరహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హుజూరాబాద్కు భౌగోళికంగా జిల్లాగా ఏర్పాటుకు అవసరమైన అన్ని అవకాశాలు ఉన్నాయని అన్నారు. గతంలో కూడా పీవీ జిల్లా కోసం ఇక్కడి ప్రజలు ఉద్యమించారని గుర్తు చేశారు. అందువల్ల హుజురాబాద్ జిల్లా ఏర్పాటుకు ముఖ్యమంత్రి చొరవ తీసుకోవాలని అన్నారు. కేసీఆర్ రెండోసారి సీఎం అయిన తర్వాత నారాయణపేట, ములుగులను జిల్లాలుగా ప్రకటించారని తెలిపారు. అయితే వాటికన్నా ఎక్కువ అవకాశాలు ఉన్న హుజూరాబాద్ను పీవీ జిల్లాగా ప్రకటించాలన్నారు. జిల్లా ఏర్పాటు కోసం స్థానిక ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కృషి చేయడంతో పాటు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. హుజూరాబాద్ను జిల్లాగా ప్రకటించే వరకు పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సాధన కమిటీ సభ్యులు మండల కన్వీనర్ గూడూరి స్వామిరెడ్డి, నాయకులు వెంకటేశ్వర్లు, భానుకి రణ్, శ్రీనివాస్, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
Authorization