- సమావేశాలకు అనుమతి తప్పనిసరి
- పోలింగ్కు 44 గంటల ముందేప్రచారాన్ని ముగించాలి
- జిల్లా కోశాధికారి శ్రీనివాస్
నవతెలంగాణ-తిమ్మాపూర్
స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్, వార్డులకు పోటీచేస్తున్న అభ్యర్థులు తమ ఖర్చులను తప్పనిసరిగా చూపాలని జిల్లా కోశాధికారి శ్రీనివాస్ తెలిపారు. మండలంలోని రామకృష్ణకాలనీలో గల వాగేశ్వరి ఇంజనీరింగ్ కళాశాలలో శనివారం సర్పంచ్, వార్డు సభ్యులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభ్యర్థులు ఎన్నికల నియమ నిబంధ నలు పాటించాలని సూచించారు. సర్పంచ్ అభ్యర్థి అయితే రూ.1.50 లక్షల లోపు, వార్డు సభ్యులు రూ.30 వేల లోపు ఖర్చు చేయవచ్చని తెలిపా రు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10.30 వరకు మాత్రమే ప్రచారం నిర్వహించుకోవాలని అన్నారు. ప్రభుత్వ స్థలాలు, ప్రార్థనా స్థలాలలో ఎలాంటి ప్రచారాలు నిర్వహించరా దన్నారు. పోలింగ్కు 44 గంటల ముందే తమ ప్రచారాన్ని ముగించుకో వాలని చెప్పారు. పోలింగ్ రోజు ఓటర్లను తరలించేందుకు వాహనాలు పెట్టరాదని అన్నారు. సమావేశాలకు సైతం తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని లేనిపక్షంలో కఠిన చర్యలు ఉంటాయని అన్నారు. పోస్టర్లు, ఫ్లెక్సీలు అతికించేటప్పుడు ఇంటి యజమాని అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని తెలిపారు. అనంతరం ఎల్ఎండీ ఎస్ఐ నరేశ్రెడ్డి మాట్లాడుతూ ప్రచారంలో అభ్యర్థులు మైకులు పెట్టవద్దన్నారు. అలాగే వాహనాలకు అనుమతి తీసుకునే తిప్పాలని తెలిపారు. ఓటర్లను బెదిరింపులకు గురిచేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాల్లో ఫ్లెక్సీలు పెట్టరాదని, అనుమతి తీసుకున్న ఇండ్ల వద్ద పెట్టుకోవాలన్నారు.
గ్రామాల్లో పోలింగ్ రోజున 144 సెక్షన్ ఉంటుందని ముగ్గురికి పైగా వ్యక్తులు ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల దూరంలో ఉండాలన్నారు. పోలింగ్బూత్ల వద్ద ఎలాంటి ప్రచారం చేయరాదని తెలిపారు. అలాగే గెలిచినవారు విజయో త్సవ ర్యాలీలు నిర్వహించరాదని చెప్పారు. ఎంపీడీవో హరిప్రి య మాట్లాడుతూ ఎన్నికల ఖర్చు సమర్పించుకుంటే తర్వాత ఎన్నికల్లో పోటీకి అనర్హులు అవుతారని చెప్పారు. ఎన్నికల నియమావళిని తప్పనిసరిగా పాటించాలని అన్నారు. పోలింగ్, కౌంటింగ్ సమయాల్లో సెల్ఫోన్ వాడరాదని అన్నారు.
Authorization