మానకొండూర్: ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని మండలంలోని గంగిపల్లి ఎస్ఎస్వి పాఠశాలలో శనివారం విద్యార్ధులచే నమూనా పోలింగ్ నిర్వహించారు. ఎన్నికల విషయమై పాటించే నియమాలు, అధిలారులు తీసుకునే చర్యలు, ఓటు హక్కు వినియోగంపై పాఠశాల యాజమాన్యం విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్బంగా పాఠశాల ప్రిన్సిపాల్ రంగు శ్రీనివాస్ మాట్లాడుతూ నిస్వార్థ నాయకులను ఎన్నుకోవడంపై పోలింగ్ ద్వారా అవగాహన కల్పించినట్టు తెలిపారు. మార్పు అనేది విద్యార్థుల నుంచి వస్తుందన్నారు. మంచి పాలకులను ఎన్నుకోవాడనికి ఈ నమూనా పోలింగ్ ఎంతో దోహదపడుతుందన్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యార్థులు ఓటు హక్కు గురించి తెలుసుకున్నారన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.