శంకరపట్నం: మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో నేడు ప్రత్యేక ఓటరు దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తహసీల్దార్ రాజలింగం శనివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల పరిధిలో అర్హులైన ప్రతిఒక్కరూ ఓటరు నమోదు చేసుకోవాలన్నారు. దీనికోసం గ్రామాల్లోని బూత్లెవల్ అధికారులను సంప్రదించాలన్నారు. అంతేకాకుండా ఓటరు నమోదులో దొర్లిన తప్పులను సైతం సవరించుకోవచ్చని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో వట్టెం శ్రీనివాస్, సిబ్బంది, తదితరులు, పాల్గొన్నారు.