నవతెలంగాణ-చొప్పదండి
చొప్పదండి మండల కేంద్రంలోని ఎమ్మార్సీ భవనంలో శనివారం 9వ జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా నియోజకవర్గ స్థాయి ఉపన్యాస, వ్యాసరచన పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో పాల్గొని విజేతలుగా నిలిచిన వారు జిల్లాస్థాయి పోటీ ల్లో పాల్గొంటారని తహసీల్దార్ గుర్రం శ్రీనివస్గౌడ్, ఎంఈవో సీహెచ్ రాజస్వామిలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపన్యాస పోటీలలో సీనియర్ లెవెల్లో వరుసగా మూడు స్థానాలో రుక్మాపూర్ గురుకులానికి చెందిన ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థి టీ.మధు, చొప్పదండి ప్రభుత్వ జూనియర్ కాలేజీకి చెందిన ఆర్. రమేష్ (ఇంటర్ మొదటి సంవత్సరం), రుక్మాపూర్ గురుకుల కాలేజీకి చెందిన ఎస్. సైమాన్పాల్ (ఇంటర్ మొదటి ఏడాది)లు విజేతలుగా నిలిచారని తెలిపారు. జూనియర్ లెవల్లో ప్రథమ స్థానంలో లిటిల్ హైలాండ్కు చెందిన జీ. వైష్ణవి(9వ), ద్వితీయ స్థానంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఓద్యారంకు చెందిన తేజస్వీ (9వ), తృతీయ స్థానంలో రామడుగు మండలంలోని రుద్రారం జెడ్పీహెచ్ఎస్కు చెందిన జి.అభినయలు గెలిచినట్టు చెప్పారు. వ్యాసరచన పోటీలలో సీనియర్ లెవెల్లో వరుసగా మూడు స్థానాల్లో ఎం. అన్వేష్, టీ. మధు ఎస్.సైమాన్ పాల్లు జూని యర్ లెవల్లో వరుసగా మూడు స్థానాల్లో జి.తేజస్వి, కె.అనూషలు విజేతలుగా నిలిచారని అన్నారు. వీరందరూ ఈ నెల 21న కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించే జిల్లాస్థాయి పోటీల్లో పాల్టొంటారని తెలిపారు. న్యాయనిర్ణేతలుగా తహసీల్దార్ గుర్రం శ్రీనివాస్గౌడ్, ఎంఈవో సీహెచ్ రాజస్వామి, ఉపా ధ్యాయులు ఎం.శ్రీనివాస్, ఆర్. మురళిమనోహర్, ఎమ్మార్సీ సిబ్బంది డి.శ్రీనివాస్, బి.శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.
Authorization