- 69 సర్పంచ్, 533 వార్డు స్థానాలకు ఎన్నికలు
- 13 జీపీలు ఏకగ్రీవం
- రేపు మొదటి విడత గ్రామపంచాయతీలకు ఎన్నికలు
- ఏర్పాట్లు సిద్ధం చేసిన అధికారులు
నవతెలంగాణ-సిరిసిల్ల
శనివారం సాయంత్రంతో రాజన్నసిరిసిల్ల జిల్లాలో మొదటి విడత జరుగనున్న గ్రామపంచాయితీ ఎన్నికలకు ప్రచారం ముగిసింది. మొదటి విడతలో జిల్లాలో 13 గ్రామపంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. కాగా 67 గ్రామపంచాయతీలకు 279 సర్పంచ్ అభ్యర్థులు, 533 వార్డులకు 1,357 అభ్యర్థులు బరిలో ఉన్నారు. సోమవారం జిల్లాలో మొదటి విడత ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. ఆ దిశగా అధికారులు సన్నద్ధమయ్యారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 12 మండలాల్లో గల 254 గ్రామపంచాయతీలతోపాటు 2230వార్డులకు మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. మొదటి దశ సోమవారం 5 మండలాలలోని 80 గ్రామపంచాయతీలకు 722వార్డులకు ఎన్నికలు జరగాల్సి ఉంది. కాగా ఇప్పటికే ఎన్నికలు జరగాల్సిన ఐదు మండలాలలోని 80 గ్రామపంచాయతీలలో 13 ఏకగ్రీవం కాగా, 67 గ్రామపంచాయతీలలో సర్పంచ్ ఎన్నికలు జరుగనున్నాయి. 279 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో ఉన్నారు. 772 వార్డుల్లో 188 వార్డులు ఏకగ్రీవం కాగా 533 వార్డులలో ఎన్నికలు జరుగనున్నాయి. మొత్తం 1.357 మంది బరిలో ఉన్నారు. బోయిన్పెల్లి మండలంలో 23 గ్రామపంచాయతీలు ఉండగా రెండు గ్రామాల్లో సర్పంచ్లు ఏకగ్రీవమయ్యారు. 21 సర్పంచ్ స్థానాలకు 89 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 212 వార్డులకు 42 ఏకగ్రీవం కాగా 170 వార్డు స్థానాలకు జరిగే ఎన్నికలకు 423 వార్డు సభ్యులు పోటీలో ఉన్నారు. చందుర్తి మండలంలో 19 గ్రామపంచాయతీలు ఉండగా మూడు ఏకగ్రీవమయ్యాయి. 16 సర్పంచ్ స్థానాల కోసం 69 మంది పోటీ పడుతున్నారు. 174 వార్డులకుగానూ 46ఏకగ్రీవం కాగా 127 వార్డులకు 316మంది పోటీ పడుతున్నారు. రుద్రంగి మండలంలో 10 గ్రామపంచాయతీలు ఉండగా 7 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.
మూడు సర్పంచ్ స్థానాల కోసం 11 మంది సర్పంచ్ అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 86 వార్డులు ఉండగా 57 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 29 వార్డుల కోసం 95 మంది పోటీ పడుతున్నారు. వేములవాడ అర్బన్ మండలంలో 11 గ్రామపంచాయతీలు ఉండగా 11 సర్పంచ్ స్థానాల కోసం 51 మంది పోటీలో ఉన్నారు. 104 వార్డులు ఉండగా 13 ఏకగ్రీవమయ్యాయి. 91 వార్డు స్థానాల కోసం 244 మంది పోటీలో ఉన్నారు. వేములవాడ రూరల్ మండలంలో 17 గ్రామపంచాయతీలు ఉండగా ఒక సర్పంచ్ ఏకగ్రీవమైంది. 16 సర్పంచ్ స్థానాల కోసం 59 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా 146 వార్డు స్థానాలు ఉండగా 30 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 116 వార్డు స్థానాల కోసం 279 మంది పోటీలో ఉన్నారు.
రెండో విడతలో..
జిల్లాలో 2వ విడతలో 84 గ్రామపంచాయితీలకు 744 వార్డులకు ఈ నెల 25న ఎన్నికలు జరుగనున్నాయి. రెండో విడతలోనూ 15 గ్రామపంచాయతీలు ఏకగ్రీవం కాగా 144 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 71 సర్పంచ్ స్థానాలకు 600 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.
మొత్తం 71 సర్పంచ్ స్థానాలకు 537 మంది పోటీ పడుతుండగా 600 వార్డు స్థానాలకు 1,895 మంది పోటీలో ఉన్నారు. గంభీరావుపేట మండలంలో 21 సర్పంచ్ స్థానాలు ఉండగా రెండు ఏకగ్రీవం కాగా 19 సర్పంచ్ స్థానాల కోసం 162 మంది పోటీలో ఉన్నారు. 196 వార్డు స్థానాలు ఉండగా 10 ఏకగ్రీవం కాగా 186 వార్డు స్థానాల కోసం 572మంది పోటీలో ఉన్నారు. ముస్తాబాద్ మండలంలో 22 గ్రామపంచాయతీలు ఉండగా ఒక సర్పంచ్ స్థానం ఏకగ్రీవమైంది. 21 సర్పంచ్ స్థానాల కోసం 121 మంది పోటీలో ఉన్నారు. 202 వార్డు స్థానాలు ఉండగా ఆరు ఏకగ్రీవం కాగా 196 వార్డు స్థానాల కోసం 530మంది పోటీలో ఉన్నారు. వీర్నపల్లి మండలంలో 17గ్రామపంచాయితీలు ఉండగా 4 గ్రామాల సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 13 సర్పంచ్ స్థానాల కోసం 91మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 132 వార్డులు ఉండగా 70వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 62 స్థానాల కోసం 233 మంది పోటీలో ఉన్నారు. ఎల్లారెడ్డిపేట మండలంలో 24 గ్రామాలు ఉండగా 6గ్రామాల సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 18 సర్పంచ్ స్థానాల కోసం 163మంది పోటీలో ఉన్నారు. 214 వార్డులు ఉండగా 58వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 156 వార్డు స్థానాల కోసం 560 మంది పోటీలో ఉన్నారు.
Authorization