- రాజన్న సిరిసిల్ల జిల్లా గ్రామపంచాయతీ ఎన్నికల పరిశీలకులు విజయేంద్రబోయి
నవతెలంగాణ-సిరిసిల్ల
జిల్లాలో ఈ నెల 21న జరిగే తొలి విడత గ్రామపంచాయతీ ఎన్నికలు సజావుగా, పారద ర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన చర్య లు తీసుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా గ్రామ పంచాయతీ ఎన్నికల పరిశీలకులు విజయేంద్ర బోయి అన్నారు. శనివారం కలెక్టర్ కార్యాల యంలో జేసీ యాస్మిన్భాషా, డీఆర్వో ఖీమ్యా నాయక్, డీపీవో శేఖర్లతో గ్రామ పంచాయతీ ఎన్నికల పరిశీలకులు విజయేంద్రబోయి సమా వేశమయ్యారు. ఈ సమావేశంలో విజయేంద్ర బోయి మాట్లాడుతూ జిల్లాలో నిర్వహించే గ్రామ పంచాయతీ ఎన్నికలను సవాల్ తీసు కుని శాసనసభ ఎన్నికల మాదిరిగా ప్రశాంతం గా నిర్వహించాలన్నారు.
జిల్లాలో గుర్తించిన సమస్యాత్మక, అతి సమస్యాత్మక గ్రామాల్లో పోలీసు బందోబస్తు పెంచి ఎలాంటి అవాంఛ నీయ సంఘటనలు జరుగకుండా చర్యలు చేప ట్టాలన్నారు. పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం ఒంటి గంటతో ముగుస్తుందని తదుపరి 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభించి ఫలితాలు ప్రకటించే వరకు అధికారులు అక్కడే ఉండాలన్నారు. 5 వేల వరకు ఓటర్లు ఉన్న గ్రామాల్లో రాత్రి వరకు ఓట్ల లెక్కింపు ఉంటుందని, ఇబ్బందులు కలగకుండా అవసరమైన చోట్ల జనరేటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థ్ధులకు ఖర్చులు నియంత్రణపై అవగాహన కల్పించాలన్నారు. రీపోలింగ్ ఆస్కారం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా జేసీ, డీఆర్వో జిల్లాలో మొదటి విడత ఎన్నికల ఏర్పాట్లను వివరించారు. ఆమె సమక్షంలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ పర్సన్స్, సూక్ష్మ పరిశీలకుల ర్యాండమైజేషన్ ప్రక్రియను అధికారులు చేపట్టారు.
ఎన్నికల నిర్వహణలో అధికారులు అలసత్వం వహిస్తే చర్యలు
గ్రామ పంచాయతీ ఎన్నికలు సజావుగా నిర్వహించేందు అన్ని చర్యలు తీసుకున్నామని జేసీ యాస్మిన్బాషా తెలిపారు. అందులో భాగంగా జోనల్ అధికారులను, సహాయ ఎన్నికల ఖర్చుల పరిశీలకులను, ఫ్లయింగ్ స్కాడ్ బందాలను, వీడియో వీవింగ్, వీడియో సర్వేలెన్స్ అకౌంటింగ్ టీమ్ ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నామని వివరించారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని, నిఘా పెంచుతామని జేసీ యాస్మిన్ భాషా తెలిపారు. ఎన్నికల నిర్వహణలో అధికారులు అలసత్వం వహిస్తే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని జేసీ హెచ్చరించారు.
Authorization