- మంగళపల్లి గ్రామపంచాయతీ ఏకగ్రీవం
- ఉపసర్పంచ్కి పెరుగుతున్న పోటీ
- ముగిసిన మొదటి విడత ఎన్నికల ప్రచారం
నవతెలంగాణ-చొప్పదండి
గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా పల్లెల్లో గెలుపు కోసం సర్పంచ్గా పోటీ చేస్తున్న అభ్యర్థులు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. మండలంలో మొదటివిడతలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అభ్యర్థులు తమ గెలుపే లక్ష్యంగా ఎవరికీ వారే ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు.
మండలంలో 16 గ్రామపంచాయతీలు ఉండగా మంగళపల్లి గ్రామపంచాయతీ ఏకగ్రీవమైంది. అంతే కాకుండా మండలంలోని 34 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. దీంతో మిగిలిన 15 గ్రామపంచాయతీలకు గాను 80 మంది అభ్యర్థులు, 120 వార్డులకు గాను 331 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఈ స్థానాలకు ఈ నెల 21న ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల ప్రచారం సైతం శనివారంతో ముగియడంతో విందు, వినోదాలతో ఓటర్లను ఆకర్షిస్తు న్నారు. అయితే పలువురు అభ్యర్థులు మాత్రం ఓట్లు ఎటు వైపు పడతాయోనని ఆందోళన చెందుతున్నారు.
ముగిసిన మొదటి విడత ఎన్నికల ప్రచారం
మండలంలో 8 జనరల్ స్థానాలకు కేటాయించగా ఎస్సీలకు 6, బీసీలకు 2 స్థానాలను అధికారులు కేటాయిం చారు. జనరల్ స్థానాలు కేటాయించిన గ్రామపంచాయతీల్లో పోటీచేస్తున్న అభ్యర్థుల మధ్య తీవ్రపోటీ నెలకొంది. కుల సంఘాలు, సామాజిక వర్గాల వారిని, పెద్దమనుషులను, యువకులను సమీకరిస్తూ తమకంటే తమకు మద్దతు తెలుపాలని అభ్యర్థిస్తున్నారు. అదేవిధంగా మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు తాము చేసిన అభివృద్ధి చేసిన పనులను గుర్తించి మళ్లీ అవకాశం ఇవ్వాలని ప్రచారాన్ని కొనసాగించారు.
మంగళపల్లి గ్రామపంచాయతీ ఏకగ్రీవం
మండలంలోని మంగళపల్లి గ్రామపంచాయతీ ఏకగ్రీవమైంది. ఆ గ్రామంలోని సర్పంచ్, వార్డు సభ్యులను సైతం ఆ గ్రామస్తులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ గ్రామపంచాయతీ గత ఎన్నికల్లో సైతం ఏకగ్రీవమైన విషయం తెలిసిందే.
ఉపసర్పంచ్ పదవికి పెరిగిన పోటీ
నూతన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం సర్పంచ్తో పాటు ఉపసర్పంచ్కి జాయింట్ చెక్పవర్ ఉంది. దీంతో ఈ పదవికి పోటీపడుతున్న ఆశావహుల సంఖ్య ఎన్నికల తేది దగ్గర పడుతున్న కొద్ది పెరుగు తోంది. రిజర్వేషన్ ప్రకారం పంచాయతీల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్ కల్పించడ తో ఆ గ్రామాల్లో ఉపసర్పంచ్కి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందనే ఆలోచనతో వార్డు సభ్యుడిగా గెలిచి ఉపసర్పంచ్ పదవి దక్కించుకోవాలని ఆసక్తిగా ఎదురుచూస్తు న్నారు. దీంతో వార్డుల్లో గెలవడానికి కూడా అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠత నెలకొంది.
గెలుపే లక్ష్యంగా ముందుకు
సర్పంచ్గా పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ గెలుపే లక్ష్యంగా ముందుకుసాగుతు న్నారు. మండలంలోని చిట్యాలపల్లి గ్రామపంచాయతీ ఎస్సీకి రిజర్వుకావండంతో అక్కడ ఎనిమిది మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. అంతే కాకుండా మండలంలోనే పెద్ద గ్రామపంచాయతీ అయిన ఆర్నకొండలో సైతం అభ్యర్థుల మధ్య పోటీ ఎక్కువగానే ఉంది. మండలం లోని అన్ని గ్రామపంచాయతీ ల్లోను దాదాపు ఇలాంటి పరిస్థితే నెలకొంది. మొదటి విడత ఎన్నికల ప్రచారం శనివారంతో ముగియడంతో ప్రత్యర్థుల బలహీనతలను తెలుసుకుంటూ వాటిపై దృష్టిపెడుతున్నారు. యువ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తమకు మద్దతు తెలుపుతున్న వారిని ఎటువైపు వెళ్లకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు సైతం తీసుకుంటున్నారు.
పార్టీలకతీతంగా సాగిన ప్రచారం
మండలంలో సర్పంచ్ పదవులకు పోటీ చేస్తున్న అభ్యర్థులు పార్టీలను కాదని సొంతంగానే ప్రచారం సాగించారు. పార్టీల ప్రభావం లేకుండానే ఎవరికి వారే తమ తమ మద్దతుదారులతో ప్రచారం నిర్వహించారు. పంచా యతీ ఎన్నికల్లో అభ్యర్థులకు వ్యక్తిగతంగా ఉన్న పేరుతోనే ఓట్లు పడతాయనే నమ్మకంతో రాజకీయ నాయకుల ప్రభావం తగ్గింది. గతంలో ఒకే పార్టీలో పనిచేసిన వారు సైతం స్థానిక సంస్థల ఎన్నికల్లో వేర్వేరుగా పోటీ చేస్తున్నారు. అంతేకాకుండా ఈ ఎన్నికలు పార్టీల గుర్తులు లేకపోవడంతో పలువురు నాయకులు తమకు నచ్చిన అభ్యర్థులను బలపరుస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించా రు. ఎన్నికలు ఈ నెల 21న ఉండటంతో ఓట్లు ఎటువైపు పడతాయోనని అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. ఏ గ్రామపంచాయతీలో ఎవరు సర్పంచ్ అవుతారో తెలుసుకోవాలంటే 21 వరకు వేచిచూడాల్సిందే.
Authorization