- విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు
- కరీంనగర్ సీపీ కమలాసన్రెడ్డి
- తిమ్మాపూర్ సర్కిల్ కార్యాలయంలోసమీక్షా సమావేశం
గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ప్రతీ ఒక్కరూ సహకరించాలని కరీంనగర్ సీపీ కమలాసన్ రెడ్డి తెలిపారు. రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగనున్న తిమ్మాపూర్, మానకొండూర్, శంకరపట్నం, చిగురుమామిడి, గన్నేరువరం మండలాలకు చెందిన పోలీస్ అధికారులతో తిమ్మా పూర్ సర్కిల్ కార్యాలయంలో ఆయన సమీక్షా సమా వేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మండలా ల్లోని స్థానిక సంస్థల ఎన్నికలు శాంతియూతంగా, ప్రశాంతంగా స్వేచ్ఛ యుతంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఆయన తెలిపారు. రెండో విడతలో భాగంగా ఈ ఐదు మండలాల్లోని 97 గ్రామాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగ నున్నట్టు ఆయన చెప్పారు. ఆయా గ్రామాల్లో సంబంధిత స్టేషన్ హౌజ్ ఆఫీసర్లు ఇప్పటికే గ్రామా లను పలుమార్లు సందర్శించారని అన్నారు. శాంతి భద్రతల విషయంలో పోలీస్ కళాబృందాలతో పాటు అది అవగాహన కార్యక్రమాలు నిర్వహించారని తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా అన్నీ ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. మండలానికి ఒక ఏసీపీ ఆధ్వర్యంలో ఐదురుగురు సీఐలు, ఏడుగురు ఎస్సైలతోపాటు పోలీసులను బందోబస్తుకు నియమించినట్టు తెలిపారు. మొదటి విడత ఎన్నికలు జరిగే ఆయా గ్రామాలలో ప్రచారం ముగిసిందని తెలిపారు. బందోబస్తుకు సరిపడా పోలసులున్నారని అన్నారు. స్థానికేతరులు గ్రామాల్లో ఉండరాదని ఓటర్లను ఎలాంటి ప్రలో భాలకు గురిచేయవద్దని అభ్యర్థులకు సూచించారు. ఎన్నికలు జరిగే మండలాల్లో రెండు రోజుల ముందే మద్యం షాపులు మూసి వేయాలని ఆదేశించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల అనంతరం గెలు పొందిన అభ్యర్థులు విజయోత్సవ ర్యాలీలు తీయ డానికి అనుమతి లేదని అన్నారు. ఎవరైనా ర్యాలీలు తీస్తే చట్టపరంగా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ నెల 21న మొదటి విడత జిల్లాలోని ఐదు మండలాల్లోని 96 గ్రామ పంచాయ తీలలో జరిగే ఎన్నికలకు పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల దృష్ట్యా సమస్యాత్మక గ్రామాలను గుర్తించి అక్కడ ప్రత్యేక పోలీసు బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. అలాంటి గ్రామాలను ఏసీపీ స్థాయి అధికారులు పలుమార్లు సందర్శించి గ్రామస్తులకు పలు సూచనలు చేశారని చెప్పారు. గ్రామాల్లో మైకులతో ప్రచారానికి అనుమతి లేదన్నారు. ఓటు వేసేందుకు ఓటర్లను తరలించేందుకు అభ్యర్థులు వాహనాలను ఏర్పాటు చేయవద్దని అలా ఓటర్లను ఎవరైనా తరలిస్తే వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఎన్నికల రోజున గుంపులుగా ఉండొద్దని పోలింగ్ కేంద్రాలకు రెండు వందల మీటర్ల దూరంలో ఉండాలని సూచించారు.
ఇప్పటికే జిల్లాలో 871 మందిని బైండోవర్ చేయగా ఉల్లంఘించిన నలుగురిని మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచి జరిమానాలు కట్టేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. మద్యానికి సంబంధించి 102 కేసులు నమోదు చేయడంతో పాటు 1665 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. 24 వాహనాలను సీజ్ చేయడంతో పాటు సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేసినట్టు తెలిపారు.
ఈ సమావేశంలో అడిషన్ డీసీపీ (అడ్మిన్) శ్రీనివాస్, కరీంనగర రూరల్ ఏసీపీ ఉషారాణి, సీఐలు కరుణాకర్ రావు, ఇంద్రసేనా రెడ్డి, రవికుమార్, మహేష్ గౌడ్, సంతోష్ కుమార్, ఎస్సైలు నరేష్ రెడ్డి, వంశీకృష్ణ, సురేందర్, సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
Authorization