నవతెలంగాణ-గంగాధర
హరితాహారం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలను నాటడంతో పాటు పెంపకాన్ని చేపట్టాలని కేంద్ర జలశక్తి అభియాన్ నోడల్ అధికారి ఎస్పీ సింగ్, కరీంనగర్ జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ అన్నారు. గంగాధర మండలంలోని వెంకటాయపల్లి, గర్శకుర్తి గ్రామాల్లో వారు గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా వెంకటాయపల్లి గ్రామంలో ఈజీఎస్ ద్వారా నిర్మించిన చెక్డ్యాంను పరిశీలించారు. అనం తరం దీనితో కలిగే ఉపయోగాన్ని అడిగి తెలుసుకు న్నారు. వాగులో చెక్డ్యాం నిర్మించడంతో భూగర్భజలా లు పెరిగాయని పీడీ వెంకటేశ్వర్రావు, సర్పంచ్ సిరిమల్ల మేగరాజ్లు కేంద్ర బృందానికి వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చెక్ డ్యాంకు పక్కనే ఉన్న నల్లాల బావిని పరిశీలించినట్టు చెప్పారు. ఈ చెక్డ్యాంతో బావిలోని ఊట పెరిగిందని తెలిపారు. అనంతరం గర్షకుర్తి గ్రామంలో పర్యటించినట్టు తెలిపా రు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని అన్నారు. నీటి సంరక్షణకు గాను ఇంకుడు గుంతల నిర్మాణాలను, మొక్కల పెంపకాన్ని చేపట్టాలన్నారు గ్రామాల్లో ప్రతి ఒక్కరూ మొక్కలను నాటడంతో పాటు వాటిని సంర క్షించాలని తెలిపారు. పీడీ వెంకటే శ్వర్రావు, ఎపీడీ మంజూలదేవి, ఎంపీపీ శ్రీరాం మధుకర్, జెడ్పీటీసీ ప అనురాధ, ఎంపీడీవో నర్సయ్య, ఏపీవో, సర్పంచ్, ఎంపీటీసీలు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.
Authorization