నవతెలంగాణ-గన్నేరువరం ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు మెనూ ప్రకారం ఆహారం అందించాలని ఎంపీపీ లింగాల మల్లారెడ్డి అన్నారు. గన్నేరువరం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రంలో మధ్యాహ్నా భోజన వసతి కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంటగది పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని అన్నారు. మెనూ ప్రకారంగా వంటకాలు చేపడుతున్నారా అని విద్యార్థులను అడిగి తెలుసున్నట్టు చెప్పారు. విద్యార్థులకు నాణ్యమైన రుచికరమైన భోజనాన్ని అందిసున్నారని అన్నారు. వంటగదితో పాటు చుట్టుపక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ న్యాత స్వప్న, ప్రధానోపాధ్యాయుడు కట్ట రవీంద్ర చారి, కే.శుభాస్, గూడూరి సురేష్, మెరుగు రాము, సురేశ్, తదితరులు పాల్గొన్నారు.