కరీంనగర్ రూరల్: రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో సీనియర్లకు, యువతకు సమాన ప్రాతినిథ్యం కేటాయించనున్నట్టు టీడీపీ మండల యువత నాయకుడు అమరనాథ్ అన్నారు. కొత్తపెల్లి మండలంలోని రేకుర్తి గ్రామంలోని 50, 51వ డివిజన్లకు సంబంధించిన టీడీపీ సీనియర్ కార్యకర్తల సమావేశాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ నుంచి కార్పొరేట ర్లుగా యువకులకు 1, సీనియర్లకు 1 చొప్పున కేటాయించాలని సూ చించారు. అలాగే ఎవరికీ టిక్కెట్ కేటాయించిన అందరూ పట్టుదలతో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పోరాడుతామని ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్టు చెప్పారు. సీఎం కేసీఆర్ ఎన్నికల కోసమే పింఛన్లు పెంచారని దుయ్యబట్టారు. నిరుద్యోగులకు గుండు సున్నా చూపారని, నిరుద్యోగ భృతి లేదని విమర్శించారు. ఈ సమావేశంలో గ్రామ అధ్యక్షుడు కుంబాల కిష్టయ్య, జిల్లా యువత ప్రధాన కార్యదర్శి కత్తుల లక్ష్మణ్, సీనియర్ టీడీపీ నాయకులు ఎదుళ్ల లింగయ్య, దుర్గం శ్రీనివాస్, దుర్గం చందు,రేవంత్ తదితరులు పాల్గొన్నారు.