నవతెలంగాణ-కరీంనగర్ రూరల్ కరీంనగర్ రూరల్ మండలంలోని నగునూరు ఉన్నత పాఠశాలలో హెచ్ఎం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో గురువారం నెల్సన్ మండేలా జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మండేలా జీవిత విశేషాలను వివరించారు. ఉపాధ్యాయులు మమత, జ్యోతి, శాంతమ్మ, శ్రీనివాస్, సరస్వతి, మల్లేశం, శంకరయ్య, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.