నవతెలంగాణ-తిమ్మాపూర్ మండలంలోని మన్నెంపల్లి గ్రామానికి చెందిన మెరుగు కిరణ్కుమార్ కుటుంబానికి సీఎంఆర్ఎఫ్ కింద మంజూరైన రూ.18 వేల చెక్కును గురువారం ఉపసర్పంచ్ పొన్నం అనిల్ గౌడ్ అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతున్న అనేక మందికి చికిత్సకు గాను ప్రభుత్వం నుంచి ఆర్థికసాయం అందిస్తూ ఆదుకుంటున్న ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు నార్ల అశోక్, పార్నంది సంపత్, టీఆర్ఎస్ నాయకులు సుదగోని కనకయ్య, గుర్రాల వెంకన్న, పార్నంది జలపతి, బూడిద కిషోర్, నాంపల్లి అంజయ్య, మహమ్మద్, కొలిపాక రాజయ్య, సారయ్య, తదితరులు పాల్గొన్నారు.