నవతెలంగాణ-గంగాధర
పశువులకు గాలికుంటు నివారణ టీకాలు వేయిం చాలని వైస్ ఎంపీపీ కంకణాల రాజగోపాల్రెడ్డి, గట్టుభూత్కూర్ సర్పంచ్ విజేందర్రెడ్డిలు అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గురువారం గ్రామంలోని పశువులకు ఉచితంగా గాలికుంటు వ్యాధి టీకాలు వేశారన్నారు. ఈ సందర్భంగా 367 పశువులకు టీకాలు వేసి 79 పశువులకు ఆరోగ్య కార్డులు పంపిణీ చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో పశు వైద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి, రైతులు, పాడి రైతులు, పశువైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
గన్నేరువరం: పాడి పశువులతోనే రైతన్నలకు ఆర్థికపుష్టి అని పశుసంవర్థక శాఖ మండల పశువైద్యాధికారి డాక్టర్ కేడీ సాంబరావు అన్నారు. గురువారం మండలంలోని చీమలకుంట పల్లి గ్రామం లోని పశువులకు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలను వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలంలో సీజన్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కర్ర రేఖ, జేవీవో స్వామి, కిరణ్ రెడ్డి, గోపాల మిత్ర సాగర్ రెడ్డి, పశుమిత్ర జ్యోతి, వోఎస్ బుర్ర దేవరాజ్ గౌడ్, కల్పన, పాడి రైతులు తదితరులు పాల్గొన్నారు.
తిమ్మాపూర్ : ఆవులకు, గేదెలకు ఎద్దులకు గాలికుంటు నివారణ టీకాలు తప్పనిసరిగా వేయిం చాలని నియోజకవర్గ మానిటరింగ్ అధికారి డాక్టర్ ప్రకాష్ అన్నారు. మండలంలోని అల్గునూర్ ,ఎల్.ఎం.డి.కాలనీలోని గిరిజా గోశాలలో ఉచిత గాలికుంటు నివారణ టీకాల కార్యక్రమాన్ని గురువా రం నిర్వహించగా ఆయన అకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో, లైవ్ స్టాక్ అసిస్టెంట్ స్వప్న,రజిత పశువైద్యాధికారులు డాక్టర్ సురేందర్ రెడ్డి, డాక్టర్ భారతి.,పాడి రైతులు తదితరులు పాల్గొన్నారు.
మానకొండూర్ : మండలంలోని మద్దికుంట, గట్టుదుద్దేనపల్లి, శంషాబాద్ గ్రామాల్లో మంగళవా రం పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టికాలను మండల పశు వైద్యాధికారులు అరవింద్ రెడ్డి, సుస్మిత ల ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. వర్షాకాలంలో పశువులకు సీజనల్ వ్యాధులు సోకకుండా టీకాలు వేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్బంగా ఆయా గ్రామాల సర్పంచ్, ఎంపీటీసీలు టీకాల కార్యక్రమాన్ని ప్రారంభిం చారు. అనంతరం వారు మాట్లాడుతూ పశు సంవర్థక శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన గాలికుంటు వ్యాధి నివారణ ఉచిత టీకాలను వేయించాలని రైతులకు సూచిం చారు. ఈ అవకాశాన్ని రైతులం దరూ సద్వినియోగం చేసుకోవాల న్నారు.
కార్యక్రమంలో గట్టుదుద్దేనపల్లి సర్పంచ్ దేవ సతీశ్ రెడ్డి, ఎంపీటీసీలు గోపు రవీం దర్ రెడ్డి, ఆకుల నర్సింగరావు, ఉప సర్పంచ్ శ్రీదర్ తో పాటు సిబ్బంది నాగేందర్ సింగ్, అభిషేక్, వెంకటయ్య, రైతులు పాల్గొన్నారు.
చొప్పదండి: గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు పశు వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ చిలుక రవీందర్ అన్నారు. మండలంలోని మంగళపల్లి గ్రామంలో గురువారం పశు వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలను వేశారు. అనంతరం ప్రాథమిక ఉన్నత పాఠశాలను ఎంపీపీ పరిశీలించారు . విద్యార్థుల హాజరు పుస్తకాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయనకు పాఠశాలకు డ్యూయల్ డెస్కులు మూత్రశాలలను రన్నింగ్ సౌకర్యం కల్పించాలని వినతి పత్రాన్ని పాఠశాల హెచ్ఎం, ఉపాధ్యాయులు అందజేశారు. అనంతరం ఎంపీపీ సర్పంచ్ ఎంపీటీసీ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యా యుడు బిజిలి కనకయ్య, సర్పంచ్ నాగిరెడ్డి, ఎంపీటీసీ విజయలక్ష్మి, ఉప సర్పంచ్ సురేష్, ఉపాధ్యాయులు పులిపాక కిషన్, శ్రీనివాస రెడ్డి, తిరుపతి, పశువైద్యాధికారి శశి కాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Authorization