నవతెలంగాణ-మానకొండూర్
ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యలు పరిష్కరిం చడంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలకు నిరసనగా రాష్ట్ర ఉపాధ్యాయుల పోరాట కమిటీ పిలుపు మేరకు ఈ నెల 20న కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహిస్తున్నట్టు డీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కోహెడ చంద్రమౌళి పిలుపు నిచ్చారు. మండల కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యా రంగంలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం దశల వారిగా ధర్నాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. గతేడాది మేలో ప్రభుత్వం ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా పరిష్కరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది కాలంగా రావాల్సిన పిఆర్సీ అమలు చేయలేదని, కనీసం ఐఆర్ ప్రకటించలేదని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే సీపీఎస్ ను రద్దు చేసి పాత పింఛన్ విధానాన్ని అమలు చేయల న్నారు. ఈ నెల 20న నిర్వహించే ధర్నాను విజయవం తం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు సత్యనారాయణరెడ్డి, రామన్న, అమరెందర్ రెడ్డి, పాల్గొన్నారు.
చొప్పదండి:రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మే16న 2018లో ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలతో జరిపిన సమావేశంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని పలువురు ఉపాధ్యాయ సంఘాల నాయకులు అన్నారు. సంఘాల పోరాట కమిటీ యూ ఎస్ పి సి ఆధ్వర్యంలో ఈ నెల 20న జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహిస్తున్నట్టు స్టీరింగ్ మండలాధ్యక్షుడు బిజిలి కనకయ్య గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు జి,.అశోక్, యేసు రెడ్డి, సముద్రాల అంజయ్య, లక్ష్మీనారాయణ, శాంత్ కుమార్ , అంజలి, సురేశ్, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
Authorization