నవతెలంగాణ-చొప్పదండి ఇటుక బట్టీల యజమానులపై కేసులు చేయాలని నమోదు చేయాలని రెవెన్యూ అధికారులు ఆదేశాలు ఇచ్చిన పోలీసులు పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మండల కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో రైతులు మాట్లాడుతూ చొప్పదండి శివారు ప్రాంతం గుమ్లాపూర్ రోడ్డు వెంబడి నిబంధనలకు విరుద్ధంగా ఇటుక బట్టీలు నడుపుతూ యదేచ్ఛగా ఇటుకను తరలిస్తున్న పోలీసులు పట్టించు కోవడం లేదని రైతులు వాపోయారు. జిల్లా అధికారులు సైతం ఆదేశాలు ఇచ్చారని గుర్తు చేశారు. వెంటనే సంబంధిత ఇసుక పట్టీలను సీజ్ చేసి కేసులు నమోదు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. రైతులు ఎస్ రాజశేఖర్ రెడ్డి, నూనె చందు, గుండా సత్యనారాయణ రెడ్డి, శంకర్ , రాజేశం, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.