- టీడీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి జోజిరెడ్డి నవతెలంగాణ-మంకమ్మతోట రైతు రుణమాఫీ చేస్తామని అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ వాటి ఊసే లేదని టీడీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి జోజిరెడ్డి అన్నారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓట్ల కోసం టీఆర్ఎస్ నోట్ల రాజకీయం చేస్తుందని అన్నారు. రైతుల నుండి బలవంతంగా బ్యాంకర్లు డబ్బులు వసూలు చేస్తున్నారన్నారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై అధికార పార్టీ ఏకపక్షంగా వ్యవహరిస్తుందన్నారు. ఓటర్ల జాబితా సరిగా లేదని ఈ అవకతవకలపై రివ్యూ చేసే అవకాశం లేకుండా హడావుడిగా ఎన్నికలు నిర్వహించాలని అనుకొవడం పిరికి చర్యలకు నిదర్శరన మన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీ పోటీచేస్తుందన్నారు. గంగాధర మండలం నారాయణపూర్ రిజర్వాయర్లో మునిగిపోయిన ఇండ్లతో పాటు గ్రామాన్ని మొత్తం ముంపు గ్రామంగా ప్రకటించి వారికి వెంటనే పునరావాసం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పలువురు నాయకులు ఉన్నారు.