- బీజేపీ నాయకుడు జాడీ బాల్రెడ్డి
నవతెలంగాణ-కరీంనగర్ రూరల్
ప్రజల అవసరాలు, మౌలిక సదుపాయాలు కల్పించడంలో టీఆర్ఎస్ నాయకులు విఫలమయ్యారని బీజేపీ నాయకుడు జాడీ బాల్రెడ్డి అన్నారు. కొత్తపల్లి మండలంలోని రేకుర్తి గ్రామంలో గురువారం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ నాయకులు సంపాదనే ధ్యేయంగా కనబడుతోందని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నాయకులకు ప్రజల అవసరాలు, మౌలిక సదుపాయాలు కల్పించడంలో విఫలం అయ్యారని దుయ్యబట్టారు. రేకుర్తి గ్రామంలో టీఆర్ఎస్ సర్పంచ్ డబ్బు సంపాదించడం కోసం మాత్రమే పనిచేశారని, ఐదేండ్లలో డ్రయినేజీలు నిర్మించలేదని విమర్శించారు.
ప్రధాని నరేంద్రమోడీ ఆధ్వర్యంలో చేపట్టిన సంక్షేమ పథకాలను వివరించారు. కరీంనగర్ ఎంపీ బండి సంజరుకుమార్ ఆధ్వర్యంలో రేకుర్తిలో రెండు డివిజన్ల గెలుపే లక్ష్యంగా కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో బీజేవైఎం జిల్లా కార్యదర్శి రాములు, ఎస్సీసెల్ కార్యదర్శి రాములు, లక్ష్మిరాజం, శ్యాం సుందర్, రమేష్, చరణ్, కిరణ్, నారాయ ణ, బాస్కరా చారి, రామస్వామి, చంద్రయ్య, ,అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
Authorization