నవతెలంగాణ-మంకమ్మతోట మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ కల్పించాలని తెలంగాణ జ్యోతిభా పూలే బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రాచకొండ సత్యనారాయణరావు అన్నారు. నగరంలోని ప్రెస్ భవన్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల నిర్వహించిన సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా కేటాయించిన రిజర్వేషన్లో అన్యాయం జరిగిందని వాపోయారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు న్యాయం చేయాలని అన్నారు.ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు వంగా వేంకటేశ్వర్లు సత్యనారాయణ,నారాయణగౌడ్ ఉన్నారు.