- సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ కె.వి రమణాచారి నవతెలంగాణ-సిరిసిల్ల రానున్న మున్సిపల్ ఎన్నికలను పకడ్బందీగా నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు సన్నద్ధం కావాలని సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ కెవి రమణాచారి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని సినారె కళామందిరంలో మున్సిపల్ ఎన్నికల సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రానున్న మున్సిపల్ ఎన్నికలకు సిబ్బంది సిద్ధం కావాలన్నారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా ఎలాంటి ఆటంకం లేకుండా నిర్వహించాలన్నారు. ఇందుకు ప్రణాళికను సిద్ధం చేసుకుని ప్రణాళిక బద్ధంగా నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశంలో బూత్ లెవెల్ అధికారులు ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.