- నేడు ఐఎమ్ఏ సంతాపం సభ
నవతెలంగాణ - కరీంనగర్ టౌన్
తానా రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.సత్యసాగర్రావు గుండెపోటుతో గురువారం మృతి చెందారు. తానా రాష్ట్ర అధ్యక్షుడిగా, వైద్యులుగా సమాజానికి ఎన్నో సేవలు చేశారు. కొన్ని దశాబ్దాలుగా ఐఎమ్ఏ, తానాకి నిరంతర సేవలు అందిస్తూ వస్తున్నారు. ఆయన సేవలను స్మరించుకుంటు నేడు ఐఎమ్ఏ ఆధ్వర్యంలో ఐఎమ్ఏ హాల్లో సంతాప సభ నిర్వహిస్తున్నట్టు, ఈ సభకు వైద్యులు పెద్త ఎత్తున హాజరు కావాలని ఐఎమ్ఏ రాష్ట్ర అధ్యక్షకార్యదర్శలు డాక్టర్ పొలాడి శ్రీనివాస్రావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సత్యసాగర్రావు కుటుంబ సభ్యులను మాజీ ఐఎమ్ఏ అధ్యక్షుడు భూంరెడ్డి, ఐఎమ్ఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ప్రతాప్రెడ్డి, ఐఎమ్ఏ రాష్ట్ర అధ్యక్షుడు (ఎలెక్ట) డాక్టర్ ఎడవెల్లి విజయేంద్రరెడ్డి, నర్సింగ్హోమ్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ రవిందర్రావు, డాక్టర్ సంపత్రావు, డాక్టర్ కిషన్రావు, ఐఎమ్ఏ పాస్ట్ అధ్యక్షుడు డాక్టర్ కస్తూరి ప్రమీల, ఐఎమ్ఏ జోనల్ ఉపాధ్యక్షులు డాక్టర్ బి.ఎన్.రావు, డాక్టర్ సాంబశివరావు, డాక్టర్ మోహన్రావు, మెడికల్ కౌన్సిల్ మెంబర్ డాక్టర్ జగన్మోహన్రావు, ఐఎమ్ఏ అధ్యక్షుడు పి.శ్రీనివాస్రావు, డాక్టర్ రవికుమార్ పలు వైద్యులు హాజరై పరామర్శించారు.
Authorization