నవతెలంగాణ-సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గిరిజన కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రాంతీయ సమన్వయకర్త డీ.ఎస్ వెంకన్న గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సిరిసిల్ల పట్టణంలో ఉన్న గిరిజన సంక్షేమ బాలికల గురుకుల కళాశాల ఆంగ్లమాధ్యమంలో ఎంపీసీ, బైపీసీ, ఇంటర్ ప్రథమ సంవత్సర ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని తెలిపారు. కళాశాలలో మిగిలిన సీట్లను భర్తీ చేసేందుకు ఆసక్తి గల విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికేట్లతో నేరుగా కళాశాలలో సంప్రదించాలని తెలిపారు.