నవతెలంగాణ-ఎల్లారెడ్డిపేట రాచర్ల గొల్లపల్లి గ్రామానికి ఎల్ఐసీ బీమా గ్రామ్ ద్వారా రెండు సోలార్లైట్లను ఇప్పించాలని ఎల్లారెడ్డి మండల యువజన సంఘాల కన్వీనర్ చేపూరి నాగరాజు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 2017-2018 సంవత్సరానికి సిరిసిల్ల ఎల్ఐసి శాఖ గత డిసెంబర్ లోనే రాచర్ల గొల్లపల్లిని బీమా గ్రామ్గా ప్రకటించారని, రూ. 50 వేలతో రెండు సోలార్ లైట్లు కావాలని గ్రామపంచాయతీ పాలకవర్గం తీర్మాణం చేసి పంపిందని పేర్కొన్నారు. 7 నెలలు అవుతున్నా సోలార్లైట్లు రాలేదని, వెంటనే ఇప్పించాలని సిరిసిల్ల ఎల్ఐసి శాఖ అసిస్టెంట్ మేనేజర్ (సెల్స్) సత్యనారాయణరావును కోరారు.