నవతెలంగాణ-ఎల్లారెడ్డిపేట మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో గురువారం ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కానపురం లక్ష్మణ్ ఎమ్మార్పీఎస్ జెండాను ఆవిష్కరణ చేశారు. ఈ సమావేశంలో లక్ష్మణ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏబీసీడీ వర్గీకరణకు చొరవ చూపాలని కోరారు. ఏబీసీడీ వర్గీకరణ కోసం అన్ని రాజకీయ పార్టీలు వారి అంగీకరం తెలుపుతూ కేంద్ర ప్రభుత్వానికి ఇంతకముందే వినతిపత్రాలు రాశాయని, ఇప్పటివరకు కేంద్రం ప్రభుత్వం జాప్యం చేయడం అమానుషమన్నారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లో వర్గీకరణ బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. జూలై 27, 28 తేదీల్లో వరంగల్ జిల్లా మేడరం సమ్మక్క-సారక్క జాతర ప్రాగంణంలో ఎమ్మార్పీఎస్ జాతీయ సదస్సు ఉంటుందన్నారు. ఈ సమావేశానికి అన్ని గ్రామాల నుండి మాదిగలు, మాదిగ ఉపకులాలు దాని అనుబంధ సంఘాలు, నాయకులు భారీ సంఖ్యలో తరలిరావాలని కోరారు. అలాగే ఈ నెల 25న నిర్వహించే మాదిగల ఆత్మ గౌరవ జాతర సభకు పెద్దఎత్తున హాజరు కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు ఎం. రాజు, పర్శరాములు, మధు, స్వామి, శ్రీనివాస్, రాజు, ఎ. చంద్రం, బాబు, సాగర్, సతీష్, తదితరులు పాల్గొన్నారు.