నవతెలంగాణ-సిరిసిల్ల ప్రభుత్వ పాఠశాల మూసివేతను వెంటనే ఉపసంహరించుకోవాలని టీఎన్ఎస్ఎఫ్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఉపాధ్యక్షుడు మోతె రాజు అన్నారు. గురువారం టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల సమస్యలను పరిష్కరించాలం టూ డీఈవో రాధాకిషన్కు వినతిపత్రం అందించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం విద్యావ్యవస్థను బలోపేతం చేయకుండా నిర్వీర్యం చేయడం కోసం కుట్రలు పన్నుతుందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం విద్యారంగంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు వెంటనే నిధులు మంజూరు చేయాలన్నారు. ప్రయివేటీకరణ పేరుతో 5వేల ప్రభుత్వ పాఠశాలలలను మూసివేసే ఆలోచనను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను వెంటనే అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యాహక్కు చట్టం 2009ని పటిష్టంగా అమలయ్యేలా చూడాలన్నారు. ఆయన టీఎన్ఎస్ఎఫ్ నాయకులు పాల్గొన్నారు.