ఎల్లారెడ్డిపేట : ఆరు నెలల్లో అభివృద్ధిలో మండలంలోని అన్ని గ్రామాల కంటే రాచర్ల గొల్లపల్లి ముందుంజలో ఉందని ఆ గ్రామ సర్పంచ్ పాశం సరోజన-దేవారెడ్డి అన్నారు. మండలంలోని రాచర్లగొల్లపల్లి గ్రామపంచాయతీ ఆవరణలో గురువారం సర్పంచ్ విలేకరులతో మాట్లాడుతూ మిషన్ భగీరథ పనులు అన్ని గ్రామాల కంటే రాచర్ల గొల్లపల్లిలోనే ముందు పూర్తిఅయ్యాయని అన్నారు. చెక్పవర్ రాకున్నా స్వంత డబ్బులతో గ్రామంలో పలు పనులు చేశామని అన్నారు. ప్రజల సహకారంతో గ్రామంలో స్వచ్ఛభారత్ను పూర్తి స్థాయిలో అమలుపరుస్తున్నామని అన్నారు. గ్రామాభివృద్ధి ప్రజల సహకారంతోనే జరిగిందని అన్నారు. బస్టాండ్ నుండి రాజన్నపేట రోడ్డు వరకు 33 ఫీట్ల రోడ్డు చేపట్టి గ్రామాన్ని మరింతఅభివృద్ది చేస్తామన్నారు.