- నగర మాజీ మేయర్ రవీందర్సింగ్ నవతెలంగాణ-మంకమ్మతోట బీజేపీకి చెందిన ముగ్గురు ఎంపీలు కలిసి ఒక్క స్మార్ట్ సిటీ అయిన తీసుకురావాలని నగర మాజీ మేయర్ రవీందర్ సింగ్ అన్నారు. నగరంలో ఆర్అండ్బీ గెస్ట్హౌస్లో గురువారం శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిజామాబాద్ ఎంపీ గల్లీ మాటలు కాదు ఢిల్లీ మాటలు మాట్లాడాలన్నారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండగా మధ్యలోనే అరవింద్ లేచి రావడం సరికాదన్నారు. కనీసం మాటలు కూడా మాట్లాడే విధానం లేదని విమర్శించారు. పసుపు బోర్డు తీసుకువస్తారని రైతులను మోసం చేస్తున్నారన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు ఖాయమన్నారు. మున్సిపల్ ఓటర్లు నమోదు చేసుకునేవారు ఫామ్6, ఫామ్8 ద్వారా నమోదు చేసుకోవాలన్నారు. సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించేలా గడప గడపకూ వెళ్లాలన్నారు.