- జిల్లా ప్రధాన కార్యదర్శి కటకం రమేష్
నవతెలంగాణ-వీణవంక
ఉద్యోగ, ఉపధ్యాయ ఆపరిష్కృత సమస్యలు పరిష్కరించి, ఐఆర్లు పెంచాలని కోరుతూ.. ఎస్టీయూ ఆధ్వర్యంలో చేపట్టిన మహాధర్నాను విజయవంతం చేయాలని జిల్లా ప్రధాన కార్యదర్శి కటకం రమేష్ తెలిపారు. మండల కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర శాఖ పిలుపు మేరకు వివిధ దశల్లో ఉద్యమ కార్యాచరణను చేపట్టాలని అందులో భాగంగానే జూలై 20న హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద మహా ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు తెలిపారు. ఉపాధ్యాయుల పీఆర్సీ, ఆర్ఐ, ఉద్యోగ పదవీ విరమణ, పదోన్నతి, తదితర పెండింగ్ సమస్యలపై ఎస్టీయూ నిరంతరం పోరాడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రమేష్, బాలాజీ, శ్రీనివాస్ గౌడ్, మనోహర్ రెడ్డి, చంద్రశేఖర్, శ్రీనివాస్ రెడ్డి, శేషాద్రి, విద్యాసాగర్, రాజమౌళి, రామలక్ష్మి, శ్రీవాణి, తదితరులు పాల్గొన్నారు.
జమ్మికుంట :గత ఏడాది మే 16న ప్రగతిభవన్లో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం నిర్వహించి 18 అంశాలపై హామీ ఇచ్చి 13 నెలలు గడిచినా ఇంతవరకు ఒక్క సమస్య కూడా సీఎం కేసిఆర్ పరిష్కారించలేదని దీంతో ఈనెల 20న కరీంనగర్లో ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటి ఆద్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని తలపెట్టినట్టు డీటీఎఫ్ జిల్లా కార్యదర్శి నరహరి పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో గురువా రం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసిఆర్ ఇకనైనా తాను ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే పోరాటాన్ని మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు. కార్యమ్రకంలో డీటీఎఫ్ నాయకులు సంతోష్రెడ్డి, అబ్దుల్ రజాక్, సత్యనారాయణరెడ్డి, ఉమారాణి, జనార్దన్, తదితరులు ఉన్నారు.
Authorization