నవతెలంగాణ-రుద్రంగి మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన నలుగురు విద్యార్థులు మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ అందించే జాతీయ మెరిట్ స్కాలర్షిప్కు ఎంపికైనట్టు కళాశాల ప్రిన్సిపాల్ రాపల్లి ఐలయ్య తెలిపారు. ఈ సందర్భంగా కళాశాలలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశం ఆయన మాట్లాడారు. కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పూర్తి చేసుకున్న నలుగురు విద్యార్థులు గసికంటి నితిన్, గౌతమి, శ్రీవాణి, నిఖితలు జాతీయ మెరిట్ స్కాలర్షిప్కు ఎంపికైనట్టు తెలిపారు. వీరికి డిగ్రీ స్థాయిలో మూడేండ్లు నెలకు రూ.వెయ్యి చొప్పున పీజీ స్థాయిలో రెండు సంవత్సరాలకు రూ.రెండు వేల చొప్పున అందించనున్నట్టు తెలిపారు. విద్యార్థులను కళాశాల అధ్యాపకులు నవీన్ రెడ్డి, ఆఫ్రిన్ నిషత్, రాజిరెడ్డి, రాజు, సుమన్, గోపి, కృష్ణ, సునీత, రాజు, పద్మలు అభినందించారు.