నవతెలంగాణ - కరీంనగర్ టౌన్ ప్రస్తుత కాలంలో జీవితం సైన్స్తో ముడిపడి ఉందని వరంగల్ ఎన్ఐటీ ప్రొఫెసర్ డాక్టర్ డి.కాశీనాథ్ అన్నారు. కరీంనగర్లోని మానేరు పాఠశాలలో సైన్స్పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఐఐటీ, ఎన్ఈఈటీ లాంటి దేశ వ్యాప్తంగా జరిగే పోటీ పరీక్షలకు ఎలా సిద్ధం కావాలో విద్యార్థులకు సూచించారు. నిత్య జీవితంలో సైన్స్ అనేక రకాలుగా వినియోగ పడు తుందన్నారు. సైన్స్తో చెలిమి చేస్తే అనేక రకాల వ్యాధులకు దూరంగా ఉండి ఆరోగ్యకర మైన కరీంనగర్ నిర్మించగల మన్నారు. మానేరు విద్యా సంస్థల అధినేత కడారి అనంతరెడ్డి మాట్లాడారు. విద్యార్థులు శాస్త్ర సాంకేతిక విజ్ఞానం దిశగా అడుగులు వేయాలన్నారు. పలువురు విద్యార్థులు అడిగిన సందేహాలను కాశీనాథ్ నివృత్తి చేశారు. అనంతరం విద్యార్థులకు పవర్ పాయింట్ ప్రాజెక్టు ద్వారా పలు విషయాలపై అవగాహన కల్పించారు. అనంతరం పాఠశాల యాజమాన్యం కాశీనాథ్ను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మానేరు విద్యాసంస్థల డైరెక్టర్ కదా సునీతా రెడ్డితో పాటు ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.