నవతెలంగాణ - కరీంనగర్ టౌన్
సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించిన గురువులను పూర్వ జాతీయ సేవా పథకం వాలంటీర్ల (ఎన్ఎస్ఎస్) సంఘం ఆధ్వర్యంలో గురు పూజోత్సవం సందర్భంగా గురువారం నగరంలోని శివాణి డిగ్రీ పీజీ కళాశాలలో సన్మానించారు. ఈ కార్యక్రమం సామాజిక వేత్త, పూర్వ వాలంటీర్ ఎ.కిరణ్కుమార్ అధ్యక్షతన సేవా నిర్వహిం చారు. ఈ కార్యక్రమంలో పదవి విరమణ పొందిన జాతీయ సేవా పథకం ప్రోగ్రాం అధికారులు జాతీయ ఇందిరాగాంధీ (ఎన్ఎస్ఎస్) అవార్డు గ్రహీతలు డాక్టర్ ఎల్లాల లక్ష్మారెడ్డి, డాక్టర్ సంగోజ్ మనోహరాచారి, కె.మాధవరెడ్డిలతో పాటు శివాణి కళాశాల ప్రోగ్రాం అధికారి కె.రజినీ కాంత్లను శాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మారెడ్డి మాట్లాడారు. విద్యార్థులు, యువకులు సేవాభావాన్ని అల వర్చుకుని సామాజిక కార్యక్రమాలు చేపడతూ విజ్ఞానం పెంపొందించుకోవాలన్నారు. ఈ కార్య క్రమంలో డాక్టర్ మనోహరాచారి, కే.మాధవ రెడ్డి, జాతీయ యువజన అవార్డు గ్రహీతలు, వాలంటర్లు సంఘ బాధ్యులు, రేండ్ల కళింగశేఖర్, అలువాల విష్ణు, ఉత్తమ యువజన అవార్డీ అమిరిశెట్టి భూంరెడ్డి, పల్లవి, ఎడ్యూకేషనల్, కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షుడు పరాంకుశం మనోహార, శ్రీకరం ఫౌండేషన్ ప్రతినిధి జి.కిరణ్, కళాశాల డైరెక్టర్లు వర్మ, ప్రభాకర్రెడ్డిలు విద్యార్థులు పాల్గొన్నారు.
Authorization