నవతెలంగాణ- వీర్నపల్లి వీర్నపల్లి మండలం భూక్యా తండా గ్రామపంచాయతీలో గురువారం ఇంటింటా మొక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ భారతి-శ్రీరాం ఎంపీటీసీ మల్లారపు అరుణ్ కుమార్ మాట్లాడారు. పల్లెలు పచ్చ పడాలి అన్నదాత తలెత్తుకొని బతకాలన్నారు. మానవ మనుగడకు మొక్కలు ఎంతో అవసరమని చెప్పారు. ప్రతి ఒక్కరూ తమవంతుగా మొక్కలు నాటి వాటి సంరక్షణకు పాటుపాడా లన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామకార్యదర్శి నీతా, వార్డుసభ్యులు రంభ, శీల, సరోజ, శ్రీనివాస్, గ్రామపెద్దలు రాములు, దేవేందర్, తిరుపతి, తులసిరాంలు పాల్గొన్నారు.