నవతెలంగాణ-మానకొండూర్
మండలంలోని శ్రీనివాసనగర్లో కస్తూర్భా పాఠశాల లోని విద్యార్థినులకు మానకొండూర్ పీహెచ్సీ ఆధ్వర్యంలో గురువారం రక్త పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్బంగా డాక్టర్ సంధ్యారాణి విద్యార్థులకు రక్త పరీక్షలు నిర్వహించి హిమోగ్లోబిన్ శాతాన్ని పరిశీలిం చారు. హిమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉన్న వారికి మందులు పంపిణీ చేశారు. విద్యార్థుల హెల్త్ ప్రొఫైల్ కింద హైట్, వెయిట్, హెచ్బి టెస్టులు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ సయ్యద్ అప్జల్, ఎస్ ఓ స్వప్న, హెల్త్ సూపర్ వైజర్ స్వరూప, ఎంఎల్టీ ప్రకాష్, ఏఎన్ఎం లు పావని, సరోజ, స్వరూప, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
భద్రతతో బస్సు నడపాలి
పెద్దపల్లి: బడి పిల్లల బస్సు నడిపే డ్రైవర్లు భద్రతతో నడపాలని ట్రాఫిక్ సీఐ బాబు రావు డ్రైవర్లకు తెలిపారు. గురువారం పెద్దపల్లిలోని ట్రినిటి పాఠశాల బస్సు డ్రైవర్లకు భద్రతపై పలు సూచనలు చేశారు. స్కూల్ విద్యార్థులను ఎక్కించుకు వెళ్లే బస్సులను తనిఖీ చేసి డ్రైవర్లకు పలు జాగ్రత్తలు సూచించారు. బస్సు డ్రైవర్ల డ్రైవింగ్ లైసెన్స్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామగుండం కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లా మొత్తంలో స్కూల్ పిల్లలకు నడుస్తున్న బస్సులను తనిఖీ చేయాలని ఆదేశాలు అందాయన్నారు. అందులో భాగంగా పెద్దపల్లి పట్టణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. మోటార్ వెహికల్ చట్టం పరిధిలోనే విద్యార్థులను బస్సులో ఎక్కించాలన్నారు. విద్యార్థులను ఎక్కించుకున్నాకనే బస్సును ముందుకు కదులాలని, విద్యార్థులు దిగే సమయంలో జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. లైసెన్స్ లేని డ్రైవర్లు ఎట్టి పరిస్థితుల్లో స్కూల్ బస్సులు నడుపవద్దన్నారు. మద్యం సేవించి స్కూల్ బస్సులను నడిపితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. డ్రైవర్లు బస్సును నడిపే సమయంలో కాకి షర్ట్ విధిగా ధరించాలన్నారు. ట్రాఫిక్ ఎస్సై ఇసాక్, ఏఎస్సై సలీం, తదితరులు పాల్గొన్నారు.
Authorization