నవతెలంగాణ-చొప్పదండి మండలంలోని చాకుంట గ్రామానికి చెందిన తుమ్మ గౌరమ్మ (93) అనారోగ్యంతో గురువారం మృతిచెందింది. లయన్స్ క్లబ్ ఆఫ్ చొప్పదండి సభ్యులు మృతురాలి కొడుకు రాజమల్లు అనుమతితో ఆమె నేత్రాలను రేకుర్తి కంటి ఆసుపత్రి టెక్నీషియన్ ఇబ్రహీం ద్వారా సేకరించారు. వీటిని హైదరాబాదులోని ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రికి తరలించినట్టు లయన్స్ క్లబ్ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ చొప్పదండి సెక్రెటరీ కొల్లూరి జితేందర్ మాట్లాడుతూ మృతురాలి కుటుంబ సభ్యులను అభినందించారు. రాము, కార్యదర్శి కొల్లూ రి జితేందర్, తదితరులు పాల్గొన్నారు.